
సగం సినిమా లీకేజి.. పైరసీ సీడీల హడావుడితో ఒక్కసారిగా సంచలనంగా మారిన
'అత్తారింటికి దారేది' సినిమా కేవలం మన దేశంలోనే కాదు.. అమెరికాలో కూడా
కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు
పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం
విశేషం. ఇక అమెరికాలో అయితే మొదటి వారాంతంలోనే 9.53 కోట్ల రూపాయలు వసూలు
చేసింది. అంటే మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో వచ్చిన వసూళ్లలో సగం
మొత్తం అమెరికాలో కూడా వచ్చిందన్న మాట.
To read full story, please visit
Sakshi ePaper
No comments:
Post a Comment